Wednesday, May 18, 2011

ఎన్.టి.ఆర్. రాజకీయ ఇతివృత్తం

ఎన్.టి.ఆర్. రాజకీయ ఇతివృత్తం గల చిత్రాలలో నటించారు. చలనచిత్రాలలో మొదటిసారి మానుకున్న కాలంలోని చివరి చిత్రాలన్నీ కుళ్ళు రాజకీయాలపైనా, వ్యవస్థపైనా తిరుగుబాటుచేసే పాత్రలు ధరించినవే. ఆయా చిత్ర సందర్భాలలో అంకురించి అతని మనస్సును తొందరపెడుతున్న భావాలను మొదటిసారిగా ఒక షూటింగ్ లో ఎన్.టి.ఆర్. బయటపెట్టారు. అలా ఔట్ డోర్ షూటింగ్ కోసం ఒకసారి హిమాలయ ప్రాంతంలోని మనాలికి వెళ్ళ్లారు. అక్కడ షూటింగ్ లోకేషన్ కు వెళ్ళ్లేసందర్భంలో బి.వి. మోహన్ రెడ్డి (తర్వాత మంత్రి) మొదలగు వారితో వేదంతధోరణిలో మాట్లాడారు. మనసులో ఏవేవో భావాలు ఆయన మాటల్లో బయటపడ్డాయి. "తెలుగు ప్రజలు" నన్ను ఇంతగా ఆదరించారు, అభిమానించి అందలం ఎక్కించారు. పేరు ప్రతిష్ట, కీర్తి, సిరిసంపదలు అన్నీ ఇచ్చారు. వారికి నేను ఏమి బదులిచ్చి రుణం తీర్చుకోగలను" అని మధనపడుతున్నట్లు మాట్లాడారు. ఆ సందర్భానికి అనుగుణంగానే బి.వి.మోహన్ రెడ్డి "అన్నగారూ! మీరు కనుక రాజకీయ రంగప్రవేశం చేస్తే ప్రజలు మీకు బ్రహ్మరథం పడతారు. ఆంధ్ర రాష్ట్రానికి మీరే ముఖ్యమంత్రి" అని తన భవిష్యవాణిని వినిపించారు. రాజకీయాలలో ప్రవేశించాలన్న తన అంతరంగంలోని తొలి ప్రకంపనలను 1980 ప్రాంతాలలో "సర్దార్ పాపారాయుడు" చిత్రం కోసం ఊటీలో షూటింగ్ లో ఉండగా ఎన్.టి.ఆర్. వెల్లడించారు. అదే ఆయన పత్రికాముఖంగా వెల్లడించిన తొలి ప్రకటన. సినిమా పత్రికల విలేఖరులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. విలేఖరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా"60" ఏళ్ళ్లు నిండిన తర్వాత తాను ప్రజాజీవితంలోకి ప్రవేశించాలనుకుంటున్నానని" తన మనసులోని మాట చెప్పారు. ఆనాటి రాజకీయ వ్యవస్థలోని అస్తవ్యస్త పరిస్థితులను తలచుకుని బాధ ప్రకటించారు. ఈ వార్త ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించింది. తర్వాత చంద్రబాబునాయుడు అల్లుడు కావాడం ఆయన రాజకీయ రంగప్రవేశాన్ని అమితంగా ప్రభావితం చేసింది. కాంగ్రెస్ లోని అస్థిరధోరణులకు విసిగి చాలా మంది ప్రాంతీయపార్టీల గురించి చర్చించసాగారు. అల్లుడు అయిన తర్వాత చంద్రబాబు కూడా ఆయనతో తరచుగా ఈ విషయంలో చర్చించేవారు.

అప్పటికే ఎన్.టి.ఆర్. రాజకీయాలలోకి రాబోతున్నారన్న వార్తలు కాంగ్రెస్ నాయకులను కలవరపరిచాయి. అల్లుడి పెండ్లి రిసెప్షన్ కు ఎన్.టి.ఆర్. బంజారాహిల్స్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అంజయ్య ఎన్.టి.ఆర్.కు రాజ్యసభ సభ్యత్వాన్ని ఎరగా చూపే ప్రయత్నం చేశారు. ఎన్.టి.ఆర్. తిరస్కరించారు. కొడితే కుంభస్థలంలాంటి ముఖ్యమంత్రి అవకాశాన్నే కొట్టాలిగాని ఈ చిన్నా చితకా ఆయనకి నచ్చలేదు. హైదరాబాద్ లో అల్లుడి రిసెప్షన్ సందర్భంలోనే అల్లుడి హొదా, అధికారంలో, పదవిలో ఉన్నప్పటి మజా ఎలా ఉంటుందో ఎన్.టి.ఆర్. కుటుంబం రుచి చూసింది. ఇంతలో చిత్తూరుజిల్లా పరిషత్ ఎన్నికల విషయంలో అంజయ్య, చంద్రబాబునాయుడును సస్పెండ్ చేసారు. అల్లుణ్ణి మళ్ళ్లీ మంత్రివర్గంలోకి చేర్పించడానికి ఎన్.టి.ఆర్. తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరకు తన మిత్రుడు అమితాబ్ ద్వారా అల్లుణ్ణి క్యాబినేట్ లో ప్రవేశపెట్టగలిగారు. అప్పుడు రామారావుకు రాష్ట్ర రాజకీయాలు ఏరకంగా నడుస్తాయో, ఎలా అన్యాయాలు, అక్రమాలు జరుగుతాయో దీనితో అర్థమైంది. అప్పటి రాజకీయం అంటే నలుగురు నాయకులు హైదరాబాద్ లో కూర్చుని, స్వార్థ ప్రయోజనాలకోసం వినోదప్రాయంగా నడిపే చదరంగమని ఆయనకు బోధపడింది. రాష్ట్ర రాజకీయాన్ని ప్రజారాజకీయాలవైపు మలుపుతిప్పే ఆలోచన ఆనాడే ఆయనలో మొలకెత్తింది.
రాజకీయ భావ స్పందనలు
NTR

భవనం వెంకట్రామ్ మంత్రి వర్గ ప్రమాణ స్వీకారోత్స్వానికి ఎన్.టి.ఆర్. రాజభవన్ కు వెళ్ళారు. ఆనాటి ఆవేడుకలు,ఆ రాజవైభవం అతని మనసులో బలమైన ముద్రవేశాయి. రాజకీయ ప్రవేశానికి మరింతపురికొల్పాయి. ఆ తర్వాత నెల తిరగకుండానే రాజకీయరంగ ప్రవేశంచేశారు. ఆయన రాజకీయాలలోకి ప్రవేశిందబోతున్నారుని వినగానే సినీరంగంలో ఆయనకు మరింత క్రేజ్ ఏర్పడింది. నిర్మాతలు చాలామంది ఆయన కాల్ షీట్స్ కోసం ఎగబడ్డారు. వారంతా ఆత్మీయులే! వారిని కాదనలేక ఒక ఉపాయం ఆలోచించి నలుగురు నిర్మాతలు కలిసి ఒకే చిత్రం ప్లాన్ చేసుకోవలసిందిగా సూచించారు. అలా నిర్మాణమైన చిత్రమే "నాదేశం" తాను షూటింగ్ లో ఉన్నా రాజకీయాలను గమనిస్తూ వచ్చారు. కాంగ్రెస్ రాజకీయాలు దిగజారిపోవటం, పరిపాలన పలచనైపోవటం వంటి పరిస్థితులు ఆయనని తొందరపెట్టాయి. ప్రజలనుండి ఒత్తిడీ, ఆహ్వానాలు పెరిగాయి.
"తెలుగుదేశం" అవతరణ
NTR

1982 మార్చి 21 తేదీన ఎన్.టి.ఆర్. జర్నలిస్ట్లులందరికీ పిలిచి రామకృష్ణ స్టూడియోలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అందులో తన గురించి తన కుటుంబం గురించి, తన ఆస్ఠిపాస్తుల గురించి, ప్రజలు చూపే ఆదరాభిమానాలకు, ప్రజానేవచేసి రుణం తీర్చుకోవాలనుకుంటున్న తన తపన గురించి వివరించారు. నటజీవితం విరమించుకున్నారు. పూర్తికాలం ప్రజలకోసం పనిచేయాలని అనుకున్నారు. పరోక్షంగా రాజకీయాలలోకి రాబోతున్నట్లు తెలిపినా, ఎన్ని ప్రశ్నలు వేసినా, రాజకీయ రంగప్రవేశం గురించి సూటిగా మాట్లడలేదు. 1982 మార్చి 29న కొత్తపార్టీ ఏర్పాటుకు సారథ్యసంఘం ఏర్పడింది. దానికి అధ్యక్షుడు ఎన్.ట్.ఆర్. కార్యదర్శి నాదెండ్ల భాస్కరరావు. మధ్యాహ్నం 2-30 గం. లకు కార్యకర్తలు, ఇతర జనంతో కూడిన బహిరంగ సభలో ఎన్.టి.ఆర్. ఉద్విగ్నంగా మాట్లాడుతు తాను "తెలుగు దేశం పార్టీ" అనే కొత్తపార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆప్రకటనకు హర్హధ్వానాలతో జనామోదం లభించింది. తెలుగుజాతి ఆత్మగౌరవ నినాదం ఆనాటి నుండి ఊపందుకుంది.
NTR

ఒక కొత్త రూపంతో, కొత్త నినాదంతో, కొత్త ఒరవడితో, ఎన్.టి.ఆర్. ఒక మహొత్తుంగ తరంగమై లేచారు. ఆయన ఆశయాలకు జనం జేజేల వర్షం కురిపించారు. వర్ణ, వర్గ వివక్షలు ఏమీ అంటని మహొద్యమం అది. ఆయన సమ్మోహన శక్తికి తోడుగా, శక్తిహీనమై పలుచబడిపోయిన కాంగ్రెస్ అశక్తత కూడా ఆయన ఉద్యమానికి బలమైన ఊపిరిపోసింది. కాంగ్రెస్ నుండి కొంతమంది ప్రముఖ నాయకులు తెలుగుదేశంలో చేరారు. ఆయన పార్టీ ఫిరాయింపులపై ఆధారపడలేదు. ఆసక్తి కూడా చూపలేదు. కొత్తరక్తం కావాలనే కోరుకొన్నారు. అభిమాన సంఘాలు రామదండుగా పనిచేశాయి. పార్టీ నిర్మాణం రాష్ట్రస్థాయి నుండి గ్రామ స్థాయికి పాకింది. 1982 ఏప్రిల్ 11వ తేదీన నిజాం కాలేజీ గ్రౌండ్స్ల్ల్ల్లో లక్షలాది జనంతో చారిత్రాత్మకమైన మొట్టమొదటి మహాసభ - మహానాడు విజయవంతం అయింది. రామకృష్ణా స్టూడియో నుండి నిజాం కాలేజీ వరకు కొనసాగిన ర్యాలీ హైదరాబాద్ వీధులను దద్దరిల్లజేసింది. ఆ సభలో ఎన్.టి.ఆర్. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి, వారికి ఒక గుర్తింపు, గౌరవం తేవటానికి కుళ్ళ్లిపోయిన పాత వ్యవస్థను కూకటి వేళ్ళ్లతో పెకలించి నూతన వ్యవస్థను నిర్మించడానికి తాను కంకణం కట్టుకున్నానన్నారు. ఆయన మహొద్వేగంతో చేసిన తొలి ప్రసంగం జనాన్ని బాగా ఆకట్టుకుంది. అవినీతి, అక్రమాలకు తావులేని స్వచ్చమైన పాలన అందించడం కోసమే వచ్చానన్నారు. విజయవంతమైన ఆసభ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. పార్టీ జెండా, సైకిల్ గుర్తు ఏర్పడ్డాయి.
తారక రాముడి మొదటి రాజకీయ ప్రచారం 70 రోజులు 35వేల కి.మీటర్లు
NTR

జనవరి 3వ తేదీ నుండి 70 రోజులపాటు అవిశ్రాంతగా రాష్ట్రమంతటా పర్యటించారు. 35000కి.మీ. తిరిగారు. మూలమూలకూ వెళ్ళి ఆయన సందేశాన్ని ప్రజలకు అర్థమయ్యే ధోరణిలో వాళ్ల హృదయాలకు హత్తుకునేలా బోధించారు. మహత్మగాంధీ తర్వాత ప్రేమాభిమానాలతో ప్రజల హృదయాలలో స్థానం సంపాదించినది నందమూరి తారక రామారావు గారే.

ఆయన ప్రచారానికి వెళ్ళేటప్పుడు 40 సంవత్సరాలకు పూర్వం ఆయన కొనుగొలు చేసిన చెవర్‌లేట్ వ్యాన్ 1982 ఆగస్టులో 10,000 రూపాయలతో బాగుచేయించి ప్రచారానికి కావలసిన అన్ని సౌకర్యాలతో సిద్దపరచారు. అందులో ప్రచారానికి వెళ్ళే ముందు ఖాకీ దుస్తులు రెండు జతలు ,వెన్నె,తేనే, నిమ్మకాయల రసం, సోడా ఇవన్నీ వ్యాన్‌లో భద్రపరిచి వుంచేవారు. అవసరమున్నప్పుడల్లా వాటిని ఉపయోగించేవారు. దారిలో స్త్రీలు ,పురుషులు ఆబాలగొపాలం ఆయనకు దారి పొడవునా పుష్పహారాలతో ,మంగళహరతులతో జయ జయ ద్వానాలతో నాదస్వరాలతో ఆహ్వానించారు. ఆయన కోసం దారి పొడగునా ఎప్పుడు వస్తాడో ,ఎప్పుడు కనబడుతాడో అనే ఆశతో గంటల తరబడి వాననక,ఎండనక,రాత్రీ,పగలనక వేచి వుండేవారు. వెళ్ళిన ప్ర్తతిచోట పార్టీ కార్యకర్తలకు తన ఉపన్యాసాల క్యాసెట్‌లను, పోస్టర్‌లను, వాళ్లు అనుసరించవలసిన కార్యక్రమాలకు కావలసినవి ఇచ్చి బయలు దేరేవారు. ఆవ్యాన్ లోనే అల్యూమినియంతో తయారు చేసిన నిచ్చ్రెన పైన కూర్చోవడానికి ఆసనం ,లౌడ్‌స్పీకర్లు,మైక్ వంటి సౌకర్యాలన్నీ వున్నాయి. ప్రచార రథం పరిసరాలకు రాగానే ఇసుక వేస్తే రాలనంత జనం క్షణాల్లో పోగయ్యేవారు.యువకులు,పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా వేల సంఖ్యలో ప్రజలు తండోప తండాలుగా ఆ రథం చుట్టూ చేరిపోయేవారు.రామారావు గారి వాక్చాతుర్య ప్రసంగాలకు మంత్రముగ్ధులయ్యేవారు.
ప్రచార ప్రభంజనం
NTR

1982 మే 27వ తేదీన ఎన్.టి.ఆర్. 60వ జన్మదిన వేడుకలు మహానాడు రూపంగా తిరుపతిలో జరిగాయి. పార్టీ కార్యవర్గ, సర్వసభ్య సమావేశాలు విజయవంతం అయ్యాయి. జన సముద్రాన్ని చూసి ఆయన ఉత్సాహం ఉత్తుంగ కెరటంలా ఎగిసిపడింది. తిరుపతి సభావేదికపై నుండే ఆయన ప్రత్యర్థి రాజకీయాలపైన సమరశంఖం ఊదారు. పార్టీ ప్రచార జైత్రయాత్రకు నాంది పలికారు. ఆంధ్రప్రదేశ్ అంతటా పార్టీ ప్రచారానికి సన్నాహాలన్నీ జరిగాయి. పర్యటనకు అన్ని హంగులతో ఒక వ్యాన్ "చైతన్యరథం"గా రూపుదిద్దుకుంది. అందులో సకల సదుపాయాలు సమకూర్చారు. దాన్ని ఒక అందమైన ఆఫీసు గదిలా, విశ్రాంతి గదిలా మార్చారు. ఎక్కడా దేనికీ వెదుక్కోనవసరం లేకుండా, ఎవరిపైనా ఆధారపడే పని లేకుండా అందులో ఏర్పాట్లు చేశారు. "చైతన్యరథం" ప్రచారంకోసం ప్రజలమధ్యకు దూసుకుపోయింది. ఆయన సభకు వేదిక అవసరంలేదు. ఒక చౌరస్తా అయినా, ఏవిధమైన విశాలమైన బహిరంగ ప్రదేశమైనా చాలు. అర్థరాత్రి అయినా, మధ్యాహ్నమైనా సభ జరిగేది. ఆయన రాకకోసం గంటలతరబడి వేలజనం పడిగాపులుపడి ఎదురుచూసేవారు. ఆయన ఉపన్యాసం ఆవేశంతో సాగేది. అది ఆయన ఊపిరి. ఉపన్యాసం అనర్గళంగా సాగేది. ఉపన్యాసంలో తనగురించి, ఆనాటి కుళ్ళ్లు రాజకీయాల గురించి, తాను అందించబోయే ప్రజోపయోగ పాలన గురించి వివరించేవారు. ఆయన మాట ఈటెలవలే ఉండేది. సూటిగా, ఘాటుగా ఉండేది, ఉద్వేగంతో నిండేది, వేడి పుట్టించేది.
NTR

ఆయన అభిప్రాయాలలో నిజాయితీ కనిపించేది. ఆయన రూపం మాత్రమే కాదు, కంఠస్వరం, మాట కూడా గంభీరంగా ఉండేది. గర్జిస్తున్నట్టూ, ప్రత్యర్థులను గద్దిస్తున్నట్టు ఉండేది. పర్యటనలో కొండలు, కోనలు, వాగులు, వంకలు, అన్నింటినీ అధిగమించి, మారుమూల పల్లేలను కూడా వదిలిపెట్టకుండా తిరిగి ప్రచారం చేశారు. అంత విస్తృతంగా జనం మధ్యకు వెళ్ళ్లి ప్రచారం చేసిన రాజకీయ నాయకుడు మనదేశంలోనేకాదు, ప్రపంచంలోనే మరొకరు లేరు. ప్రచారంలో శంకరంబాడి సుందరాచార్య "మాతెలుగుతల్లికి మల్లెపూదండ" గీతానికి, వేములపల్లి శ్రీ కృష్ణ రాసిన "చెయ్యెత్తి జైకొట్టు" గీతానికి, జీవం పోశారు. ఆయన మార్గాన్నీ పద్ధతులను దేశంలోని నాయకులందరు అనుసరించారు. అన్నీ కొత్త పద్ధతులే, ఆంధ్ర దేశాన్ని మూడు సార్లు చుట్టివచ్చి 40వేల కిలోమీటర్లు ప్రయాణించారు. ఆ ఓపిక, ఆ దీక్ష అపూర్వం, అనితరసాథ్యం. పార్టీలో ఆయనే హీరో, మిగతా వారందరూ జీరోలయ్యారు, ఆయనకు మిగతానేతలకు అంతస్తులో తేడా బాగా వచ్చింది. ఇక జనం ఆయన వస్తున్నారంటే చేతిలో ఉన్న పనులన్నీ వదిలి, సర్వం మరచి, పరుగులు పెట్టి వచ్చేవారు. రోడ్డుపై బారులు తీరి నిలబడేవారు. ఎన్.టి.ఆర్. తాను గెలిస్తే ప్రవేశపెడతానన్న పథకాల్లొ ముఖ్యమైనవి కిలోకు రెండు రూపాయల బియ్యం పథకం, బడిపిల్లలకు మధ్యాహ్న భొజన పథకం, మనిషికి ప్రాథమిక అవసరాలైన కూడు, గూడు, గుడ్డ. "పేదవాడికి పట్టెడన్నం పెట్టాడమే కమ్యూనిజం అయితే నేనూ కమ్యూనిస్టునే" అన్నారు. ఎన్.టి.ఆర్. ఆకర్షణతోపాటు ఈ అంశాలన్నీ బాగా నచ్చాయి, ఆకర్షించాయి. ఎన్.టి.ఆర్. తమ జీవితాలపట్ల దేవుడు అనే నిర్ణయానికి వచ్చారు. హృదయపూర్వకంగా ఓట్ల వర్షం కురిపించారు.
ఓట్ల వర్షాభిషేకంతో "ముఖ్యమంత్రి"
NTR

1983 జనవరి 5వ తేదిన జరిగిన పోలింగ్ లో తెలుగుదేశం సూపర్ హిట్ అయింది. నిలుచున్న అబ్యర్థులను చూసి ఎవరూ ఓటు వేయలేదు. ప్రతి ఓటరు తాను ఎన్.టి.ఆర్. కే ఓటు వేస్తున్నాననుకుని వేశారు. ప్రతిపక్షం వారి అంచనాలను, ఇతరుల నెగెటివ్ అంచనాలను మించి ఆ ఎన్నికల్లో తెలుగుదేశం 203 స్థానాలను గెలుచుకుంది. చాలా ప్రాంతాల్లో ఎన్నికల్లో ఎన్.టి.ఆర్. నిలబెట్టిన రాజకీయ అనుభవం లేని నాయకులు కూడా గెలిచారు. అబ్యర్థుల్లో మూడు వంతులకు పైగా కొత్తవారే. ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో అపూర్వఘట్టం. చాలా నియోజకవర్గాలలో వారెవరో కూడా తెలియని నాయకులు గెలిచారు. అత్యధికులు యువకులు, విద్యాధికులు, 125 మంది పట్టభుద్రులు, 20 మంది వైద్య పట్టభద్రులు, 8మంది ఇంజనీర్లు, 28మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, కేవలం 9 నెలల ప్రాయంగల ప్రాంతీయ పార్టీ, వందేండ్ల చరిత్రగల జాతీయపార్టీని చిత్తు చిత్తుగా ఓడించింది. ఎన్.టి.ఆర్. విశ్వవిఖ్యాత ఎన్నికల విజేతగా విరాజిల్లారు. కనివిని ఎరుగని ప్రజారాజకీయాలకు ఎన్.టి.ఆర్. నాంది పలికారు. రాజ్ భవన్ ను ప్రజలమధ్యకు తెచ్చారు. రాజకీయాలకు కొత్త నిర్వచనం పలికారు, ఆంధ్రప్రదేశ్ లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. అశేష ప్రజల సమక్షంలోనే ఎన్.టి.ఆర్. మంత్రి వర్గం ముందెన్నడూ లేనివిధంగా లాల్ బహదూర్ స్టేడియంలో 15మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేస్తుంటే స్టేడియం, లక్షలాది ప్రజల ఆనందేతిరేకంతో దద్దరిల్లింది.
మొదటిసారి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ చేసిన ప్రసంగం
NTR

మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్టీఆర్ 1983 జనవరి 9 న లాల్‌బహదూర్ స్టేడియంలో అశేషజనవాహిని ఉద్దేశించి చేసిన ప్రసంగం. మహొత్తుంగ జలధి తరంగాల్లో ఉత్సాహంతో ఉప్పొంగుతున్న ఈ జనసందోహాన్ని చూస్తూంటే నాలో ఆవేశం తొణికిసలాడుతున్నది. పుట్టి ఏడాది కూడా నిండని ‘తెలుగుదేశం’ఇంత త్వరలోనే అధికారంలోకి రావడం ప్రపంచ చరిత్రలోనే అపూర్వం. ఒక్క తెలుగువాళ్ళే అసంభవాన్ని సంభవం చేయగలరని, తెలుగు పౌరుషం దావాగ్నిలా, బడబాగ్నిలా ప్రజ్వరిల్లి అక్రమాలను, అన్యాయాలను దహించగలదని రుజువు చేశారు. అందుకు తెలుగు బిడ్డగా నేను గర్విస్తున్నాను. నాకు నా జాతి చైతన్యం మీద, పరాక్రమం మీద,అచంచలమైన నమ్మకముంది. నా అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఆగ్రహిస్తే వాళ్ళ హృదయాల్లోంచి లావా ప్రవాహాలు వెలికి చిమ్ముతాయని నాకు తెలుసు. శౌర్యం విజృంభిస్తే ఎంత శక్తివంతమైన ఆక్రమ శక్తి ఐనా నేల కరుస్తుందని లక్షలాది ప్రజలు ఆచరణలో నిరూపించారు. అందుచేతనే మీ ముందు వినమ్రుడనై చెబుతున్నాను ఆది మీ విజయం.. ఆరుకోట్ల తెలుగు వీర ప్రజానీకం సాధించిన అద్బుతమైన, అపూర్వమైన విషయమని మనవి చేస్తున్నాను. ఈ మహత్తర చారిత్రాత్మక విజయంలో నా పాత్ర ఎంత? మహా సముద్రంలో నీటి బిందువంత మాత్రమే. కాబట్టి తెలుగుదేశం గెలుపు తెలుగు ప్రజలందరిది గెలపని ప్రకటిస్తున్నాను.

ఈ ఎన్నికల్లో జనబలం అన్నింటినీ జయించింది. తెలుగు వారి అత్మాభిమానం అంగడి సరుకు కాదని తెలుగువాడు మూడోకన్ను తెరిస్తే అధర్మం,అన్యాయం, కాలి బూడిదై పోతాయని మన రాష్ట్ర్రంలో విజృభించిన జన చైతన్య ప్రభంజనం చాటి చెప్పింది. దాని ముందు కొండలు కూడా బెండులాగా ఎగిరిపోతాయాని రుజువైంది. మీరిచ్చిన ప్రోత్సహ తరంగాల మీదనే నా ప్రచార జైత్రయాత్ర అవిఘ్నంగా అప్రతిహతంగా సాగిపోయింది.

నా పట్ల ప్రజలు ప్రదర్శించిన వాత్సల్యానికి, చేకూర్చిన ఈ అద్బుత విజయానికి ఎలా,ఏమని కృతజ్ఞత చెప్పాలో నాకు తోచడం లేదు. నిజానికి మీ ప్రేమానురాగాల గిరించి వర్ణించడానికి మాటలు చాలవు. మీ ఋణాన్ని తీర్చుకోవడానికి నాకు ఒక జన్మ చాలదు. మళ్ళీ జన్మంటూ వుంటే తెలుగు తల్లికి తనయుడుగా పుట్టి మీ సేవలో నా జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని ఉంది. నాలోని ప్రతి అణువును ప్రతి రక్తపు బొట్టునూ మీ కోసం ధారబోయాలని ఉంది. ఈ ఎన్నికల రణరంగంలో నన్ను అభిమానించి, విజయోస్తు అని అశీర్వదించి, రక్తతిలకం తీర్ఛి మంగళహారతులు పట్టిన తెలుగు మహిళలకు ప్రత్యేకించి మా అభినందనలు అర్పిస్తున్నాను. ఇక తెలుగువాడినీ, వేడిని ప్రతిబింబించే ఉడుకు నెత్తురు ఉప్పొంగే నవయువతరం గురించి ఏం చెప్పాలి? వాళ్ళు వీరభద్రుల్లా విక్రమించారు. తెలుగుదేశం విజయసాధనలో అగ్రగాములయ్యారు. అలాంటి నా తమ్ముళ్ళకు నేను చెప్పేదోకటే. ఇది మీ భవిష్యత్తుకు మీరు వేసుకున్న వెలుగుబాట. పోతే చిన్నారి చిట్టి బాలురున్నారు. వాళ్ళకు ఓట్లు లేవు. అయినా శ్రీరాముని సేతుబంధనంలో ఉడత సహాయంలా ఈ బుడతలు చేసిన కృషికి నేను ముగ్దుణ్ణయ్యాను. రేపటి వేకువ విరిసే ఈ లేత గులాబీ మొగ్గలను ప్రేమాభిమానాలతో ఆశీర్వదిస్తున్నాను.

తెలుగుదేశం ఎన్నికల ప్రణాళికలో రాష్ట్ర్ర అభివృద్దికి అనేక అంశాల కార్యక్రమం ఉంది. రాష్ట్ర్ర్ర ప్రజనీకం నా మీద, తెలుగుదేశం మీద ఎన్నో అశలు పెట్టుకున్నారని నాకు తెలుసు. ప్రణాళికలోని వివిధ అంశాలను వాటి ప్రాముఖ్యాన్ని బట్టి క్రమంగా అమలు జరుపుతాము. ఈ విషయంలో ఏరుదాటి తెప్ప తగలేసే తప్పుడు పని చేయబోనని హామి ఇస్తున్నాను. ప్రధానంగా సమాజంలో అట్టడుగున ఉన్న బడుగు వర్గాల అభివృద్దికి మా శయశక్తులా కృషి చేస్తాం. త్రాగేందుకు మంచి నీళ్ళకు సైతం నోచుకోని ఉళ్ళున్నాయి. తలదాచుకోను తావులేని నిర్భాగ్య జీవులున్నారు. రెక్కాడినా డొక్కాడని శ్రమజీవులు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. వాళ్ళను వేంటనే అదుకోవాలి. ఆ సమస్యను పరిష్కరించాలి గాంధీజీ గ్రామ స్వరాజ్యం గురించి కలలు గన్నారు. అదే రామరాజ్యం అన్నారు. తెలుగుదేశం గ్రామాభ్యుదయం కోసం నిర్విరామంగా పాటుపడుతుంది. బడిపిల్లలకు ఉచిత మధ్యాన్న భోజన పథకం, రెండు రూపాయలకు కిలో బియ్యం పేద ప్రజలకు ఇప్పించడం సక్రమంగా అమలు జరుపుతాము. వ్యవసాయ, పరిశ్రమలు సమాతుకంలో సత్వరాభివృద్దికి కృషి చేస్తాము. రాష్ట్ర్రంలో వెనుకబడిన, కరువు కాటకాలకు నిలయమైన ప్రాంతాల అభివృద్దికి శ్రద్ద తీసుకుంటాము. ఏ రూపంలోనూ ప్రాంతీయ సంకుచిత తత్వాలకు ఆసాధ్యం లేకుండా ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్దికి దీక్ష వహిస్తాము.

ఈ కార్యక్రమం అనుకున్న విధంగా అమలులోనికి రావాలంటే పాలన వ్యవహారాలు సక్రమంగా సజావుగా సాగాలి. ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలి. ఉద్యోగులు ప్రజా పీడకులు కాకుండా, వాళ్ళ ఉప్పు తింటున్న సేవకులుగా భావించుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు మన పాలనా వ్యవస్థ అలా లేదు. అధికార దర్పం, పనిలో జాప్యం, లంచగొండితనం వగైరా నానారకాలైన జాడ్యాలకు కేంద్రమైంది. ముప్పై ఐదు ఏళ్ళుగా పొరలు పొరలుగా పేరుకోని ఘనీభవించిన కాలుష్యాన్ని ప్రక్షాళనం చేయవలసి వుంది. అయితే ఇది అనుకున్నంత తేలిక వ్యవహారం కాదనీ నాకూ, మీకు కూడా తెలుసు. తెలుగునాట ప్రవహించే సమస్త పవిత్ర నదీ జలాలన్నింటితో కడిగినా ప్రక్షాళనం కానంతటి కల్మషం పేరుకుని వుంది. ఇది తెలుగుదేశంకు సక్రమించిన వారసత్వం. కాబట్టి ఒక్క రోజులో ఈ పాలన వ్యవస్థను మార్ఛడం అయ్యే పనికాదు. అయితే అత్మవిశ్వాసం నాకు ఉంది. మన అధికారుల అండతోనూ ఈ కృషిలో జయప్రదం కాగలమన్న కక్ష, కార్పణ్యాలే బహుమతులై మిగిలాయి. తెలుగుదేశం పాలనలో అన్ని విధాలా ప్రోత్సాహంగా ఉంటుంది. అలాగే అవినీతికి అలవాటు పడిన ఉద్యోగులకు కూడా ఈ సంధర్బంలో ఒక హెచ్చరిక చేయదలచుకున్నాను. గతంలో ఏ అనివార్య రాజకీయ కారణాలవల్లనో, ఇతర కక్కుర్తివల్లనో అక్రమాలకూ,అధికార దుర్వనియోగానికి పాల్పడి వుండవచ్చు. వాళ్ళు ఇప్పుడైన పశ్చాత్తాపం చెంది తమ పద్దతులు మార్చుకుంటే మంచిది. లేకపోతే అలాంటి విషయంలో నిర్థాక్షిణ్యంగా వ్యవహరించి తీరుతాము. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో మమ్ము ఏ శక్తి అడ్డలేదు. కానీ వాళ్ళను ఏ శక్తి రక్షించలేదని కూడా తెలియ జేస్తున్నాను. అన్నిశాఖల ప్రభుత్వోద్యోగులు మాతో సహకరించి తెలుగునాడు సర్వతోముఖ వికాసానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఉద్యోగుల సాధక బాధాకాలను మా ప్రభుత్వం సానుభూతితో పరిశీలిస్తుంది. ముఖ్యంగా చాలీ చాలనీ జీతాలతో బాధపడే వాళ్లకు తగిన సహాయం చేస్తుంది. అదే సమయంలో విద్యుక్త ధర్మ నిర్వహణలో నిజాయితిగా, సమర్థంగా పనిచేయాలని కోరుతుంది. అనేక రంగాల్లో అనుభవజ్ఞులూ, మేధావులూ మన రాష్ట్ర్ర్రంలో వున్నారు. వాళ్ళందరి సహకారాన్ని మేము సవినయంగా అర్థిస్తున్నాను.

రాను రాను మన రాష్ట్ర్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని,ప్రజల మాన , ధన ప్రాణాలకు, స్త్ర్రీల శీలానికి రక్షణ లేకుండా పోయింది. అందరికి తెలుసు. మన సమాజంలో అరాచక, హింసా, దౌర్జన్యశక్తులు వికట తాండవం చేస్తున్నాయి. ఈ విషయంలో మా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది. బందిపోట్లను, గూండాలను సమస్త సంఘ వ్యతిరేకులను నిర్థాక్షిణ్యంగా అణిచి వేసే విషయంలో అధికారులు తీసుకునే చర్యలను గౌరవించి అభినంధిస్తుంది.పోలీస్ శాఖలో ఉత్సాహవంతులు, సమర్థులు, సాహసికులూ, నీతిపరులైన వాళ్ళున్నారు. అలాంటి వాళ్ళను మా ప్రభుత్వం అభిమానిస్తుంది, ఆదరిస్తుంది. ప్రజలను రక్షించవలసిన ఈ శాఖలో ఉన్న అవినీతిని నిర్మూలించేందుకు, పోలీసుల జీతాలను బాగుపరిచేందుకు ప్రయత్నిస్తాము.పోలీసులను ప్రజలు నిజంగా తమ రక్షకులు అనుకునేటట్లు ఆ శాఖను తీర్చిదిద్దాలన్నది మా సంకల్పం. అందుకు సహకరించవలసిందిగా ఆ శాఖ ఉద్యోగులందరిని కోరుతున్నాను.

మన తెలుగునాడు వ్యవసాయ ప్రధానమైంది. అయినా రైతాంగం గిట్టుబాటు ధరలేక తగినంత పెట్టుబడి లేకా నానా ఇబ్బందులూ పడుతోంది. తెలుగుదేశంపార్టీ వ్యవసాయాభివృద్దికి, దానితోపాటు సత్వర పారిశ్రామికాభివృద్దికి పాటు పడుతుంది. మా ఎన్నికల ప్రణాళికలో ఈ రంగాలలో తీసుకోవలసిన చర్యల గురించి పేర్కొన్న అన్ని అంశాలను అమలు జరుపుతామని మనవి చేస్తున్నాను. రాష్ట్ర్ర్రాభివృద్దికి అవసరమైన అన్ని వనరులూ మనకున్నాయి.వాటిని నిర్ణీత పథకం ప్రకారం పట్టుదలతో అమలు జరపడం ద్వారా పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని అరికట్టవలసి ఉంది. ఇలాంటివే ఇంకేన్నో జటిల సమస్యలు మన ముందున్నాయి. వాటన్నింటిని ఓర్పుతో నేర్పుతో పరిష్కరించుకోవలసి ఉంది. ఈ సందర్భంలో తెలుగుదేశంను అనూహ్యమైన మెజారిటీతో గెలిపించిన తెలుగు ప్రజలందరికి నాదో విన్నపం. ఈ విజయానికి మీరే కర్తలు. అలాగే అభివృద్దికీ మీరే కర్తలు అని సవినయంగా మనవి చేసుకుంటూ శలవు దీసుకుంటున్నాను.జై తెలుగుదేశం!జై జై తెలుగుదేశం!!
ఆడపడుచులకు సముచిత స్థానం
NTR

రామారావుగారికి తెలుగు ఆడబడుచులంటే అమితమైన గౌరవాభిమానాలున్నాయి. వారి పట్ల ఆయనకు మక్కువ ఎక్కువ. మన సమాజంలో ఇంచుమించు సగం మంది స్త్రీలు వున్నా యింతకాలం వారిని గురించి ఎవరూ సరిగా పట్టించుకోలేదని,వారి బాగోగులు కోసం సంక్షేమం కోసం, అభ్యుదయం కోసం జరగవలసిన కృషి జరగలేదని ‘అన్నగా’ ఆయన బాధ పడుతుండేవారు. స్త్రీ అర్థికంగా తన కాళ్లమీద తాను నిలబడినప్పుడు, రాజకీయ సామాజిక జీవన రంగాలలో పురుషుడి సరసన ధీటుగా నిలబడినప్పుడు స్త్రీ పురోగమించగలుగుతుంది. ప్రగతిని సాధించగలుగుతుంది.

ఇంతవరకు అక్కచెల్లెండ్రకు సరైన న్యాయపరమైన జీవనం కల్పించబడలేదు. మగవారితో పాటు మగువలకు కూడా సమానమైన హక్కులు కల్పించడం అవసరం. తల్లిగా,సోదరిగా,భార్యగా, కూతురుగా పెనవేసుకోని తన జీవితాన్ని పరిపూర్ణం చేయడానికి స్త్రీ ఎంతచేస్తున్నదో ఆ విషయాన్నంతా విస్మరించాడు పురుషుడు. స్త్రీని ఎన్నో అన్యాయాలకు గురిచేశాడు. ఎన్నివిధాలుగా గురిచేశాడో ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. తిట్టడం,కొట్టడంతో పాటు అవమానించడం, అవహేళన చేయడం, మానభంగం చేయడం కట్నాల కోసమని నిలువునా హత్యచేయడం మొదలైన అనేక ఘాతుక కృత్యాలను పురుషుడు అమెమీద అమలుచేస్తున్నాడు. స్త్రీ ఎందుకింత హీనంగా,దీనంగా దిగజార్చబడిందా అని జాగ్రత్తగా చూస్తే ప్రధానంగా అమెకు తన కాళ్లమీద తాను నిలబడే అర్థిక స్వాతంత్ర్యం లేక పోవడమేనని స్పష్టమౌతుంది.

చిన్నప్పుడు తండ్రిమీద, సంసారజీవితంలో భర్తమీద, వృద్దాభ్యంలో కొడుకుమీద అధారపడి బ్రతకడమే స్త్రీ జీవితానికి అర్థంగా ఇంతకాలంగా కొనసాగుతున్న స్త్రీ పురుషుల అసమాన సహజీవన విధానాన్ని సమాన సహజీవనంగా రూపోందించాలని ఆయన మనస్సు ఆడపడుచులకై అక్క చెల్లెండ్రకై తహ తహ లాడింది. సామాజిక,అర్థిక,రాజకీయాది సమస్త జీవిత రంగాల్లోనూ స్త్రీ పురుషులు అన్యోన్యంగా సమాన గౌరవ మర్యాదలు గల హోదాను అనుభవించడానికి వీలుగా అనేక రకాల అచరణ కార్యక్రమాలను చేపట్టారు. కొడుకులతో పాటు కూతుళ్లకు కూడా వారసత్వ సంపదలో సమాన హక్కులు కల్పిస్తూ శాసనం జారీ చేయించారు. ఉద్యోగాలలో 30శాతం పోస్టులను మహిళలకు కేటాయించారు. స్త్రీలకు వృత్తి పనులు నేర్పే శిక్షణా సంస్థలు బాల మహిళా ప్రగతి ప్రాంగణాలు, స్త్రీలకోసం ప్రత్యేకంగా శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. గ్రామపంచాయితీలలో,మండల ప్రజా పరిషత్తులలో,నియోజకవర్గాలలో మహిళలకు కొన్ని పదవులను ప్రత్యేకించారు. అంతేకాక విద్య,సారస్వత రంగాలలో క్రుషి చేసిన మహిళలను సత్కరించి ప్రోత్సహించారు.

“అబల”అనే పదానికి ఇక ముందు ఆస్తిత్వం లేకుండా చేయాలన్న ధ్రుడ సంకల్పం ఆయనది. ఆయన చేపట్టిన ప్రతీ పనీ అతి ముఖ్యమైనదే. అందులో గాఢాంధకారంలో ఆవేదనతో,నిరాశతో,నిస్పృహతో,నిర్వేదంతో మగ్గుతున్న ఆడపడుచుల సముద్దరణే లక్ష్యం.ఆ బాధిత ప్రజావళికి జీవితాల్లో ఆశాజ్యోతులు వెలిగించాలి అనే పట్టుదల ఆయనది. ఆయన సేవా నిరతిని గుర్తించి ఆయన చిత్తశుద్దిని గ్రహించి తెలుగింటి ఆడపడుచులు ఆయనను “అన్నా”అని అప్యాయంగా పిలుస్తున్నారు.

No comments:

Post a Comment